Illegal Smuggling: అక్రమ కలప స్మగ్లింగ్ను అడ్డుకున్న అటవీ శాఖ..
- తూర్పు గోదావరిలో అక్రమ కలప స్మగ్లింగ్..
- వందేళ్లకు పైబడిన రావి చెట్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయం..
- దేవరపల్లిలో ఈ అక్రమ కలప మాఫియాను పట్టుకున్న అటవీశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Smuggling: తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి ప్రాంతంలో అక్రమ కలప స్మగ్లింగ్ను అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. దేవరపల్లి, కన్నాపురం ప్రాంతాల నుంచి సుమారు వంద సంవత్సరాల వయస్సు గల అరుదైన రావి చెట్లను వేళ్లతో సహా నరికి, వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయాలు జరుపుతున్న ముఠాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో కొనుగోలు చేసిన వందల ఏళ్ల వయసున్న ఈ రావి చెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. స్మగ్లర్లు ఈ చెట్లను కేవలం రూ. 80కు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. భారీ లాభాల కోసమే ఇటీవల కాలంలో కలప మాఫియా మరింతగా పెట్రేగిపోతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్కూల్ టీచర్కు ‘‘జీవిత ఖైదు’’
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
అయితే, తెలుగు ప్రజలు ఇప్పటి వరకు ‘పుష్ప’ తరహాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వింటూ వచ్చారు. కానీ, ఇప్పుడు అక్రమ స్మగ్లర్ల కన్ను అత్యంత పవిత్రంగా భావించే, వందల ఏళ్ల చరిత్ర గల రావి చెట్లపై పడటంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు పర్యావరణపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనవి అన్నారు. కాగా, ఈ దాడుల్లో అటవీ శాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది రెండు లారీలు, వాటిలో తరలిస్తున్న ఐదు భారీ రావి వృక్షాలను దేవరపల్లిలో జాతీయ రహదారి పక్కన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ చెట్లను ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!