Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ ఘటనపై మంత్రి సత్యకుమార్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు… ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. దీంతో, వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశాం అన్నారు సత్యకుమార్.. ఇక, మరణించిన వాళ్లు 58 ఏళ్ల పై బడ్డ పెద్దవాళ్లుగా గుర్తించాం అన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారన్నారు.. సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు సత్యకుమార్. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నాం అన్నారు.. మరోవైపు, నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న లాబ్స్ కు పంపామని.. పశువులకు ఇచ్చే మేత నాణ్యత పైనా నమూనాలను పరీక్షలకు పంపాం అన్నారు సత్యకుమార్ యాదవ్.. ఇక, ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
Read Also: Adulterated Ghee: రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ..
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
కాగా, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తాజాగా మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపోయారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే, రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!