MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- ముగిసిన గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు..
- టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections 2025: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. దీంతో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్టు అయ్యింది.. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తొలి రౌండ్ నుంచి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆదిత్యంలో కొనసాగారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పోలైన ఓట్లు 2,18,997 కాగా ఇందులో వ్యాలీడ్ ఓట్లు 1,99,208గా ఉండగా.. 19,789 చెల్లని ఓట్లుగా ఉండటంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 99,605 ఓట్లుగా మారింది.
Read Also: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
అయితే, మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 1,24,702 తొలి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చాయి.. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 47,241 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం..77,461 ఉండడంతోపాటు .. విజయానికి అవసరమైన 99,605 మొదటి ప్రాధాన్యత ఓట్లు దాటడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. పోటీలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ఇతరులు ఎవరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి అందించిన విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గ్రాడ్యుయేట్లు కొనసాగించారని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా రావడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూటమికి ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!