MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- ముగిసిన గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు..
- టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections 2025: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. దీంతో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్టు అయ్యింది.. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తొలి రౌండ్ నుంచి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆదిత్యంలో కొనసాగారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పోలైన ఓట్లు 2,18,997 కాగా ఇందులో వ్యాలీడ్ ఓట్లు 1,99,208గా ఉండగా.. 19,789 చెల్లని ఓట్లుగా ఉండటంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 99,605 ఓట్లుగా మారింది.
Read Also: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
అయితే, మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 1,24,702 తొలి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చాయి.. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 47,241 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం..77,461 ఉండడంతోపాటు .. విజయానికి అవసరమైన 99,605 మొదటి ప్రాధాన్యత ఓట్లు దాటడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. పోటీలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ఇతరులు ఎవరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి అందించిన విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గ్రాడ్యుయేట్లు కొనసాగించారని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా రావడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూటమికి ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!