MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- ముగిసిన గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు..
- టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections 2025: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. దీంతో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్టు అయ్యింది.. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తొలి రౌండ్ నుంచి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆదిత్యంలో కొనసాగారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పోలైన ఓట్లు 2,18,997 కాగా ఇందులో వ్యాలీడ్ ఓట్లు 1,99,208గా ఉండగా.. 19,789 చెల్లని ఓట్లుగా ఉండటంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 99,605 ఓట్లుగా మారింది.
Read Also: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
అయితే, మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 1,24,702 తొలి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చాయి.. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 47,241 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం..77,461 ఉండడంతోపాటు .. విజయానికి అవసరమైన 99,605 మొదటి ప్రాధాన్యత ఓట్లు దాటడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు.. పోటీలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ఇతరులు ఎవరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి అందించిన విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గ్రాడ్యుయేట్లు కొనసాగించారని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా రావడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూటమికి ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!