Gorantla Butchaiah Chowdary: వాళ్లు ఇప్పుడు రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా..?
- పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవీ ఇప్పుడు రాజకీయాలు వదిలేస్తే..
- చట్టం వదిలేస్తుందా? అని ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు అయినవాళ్లు.. అనుకూలంగా వ్యవహరిస్తూ.. వీడియోలు, పోస్టులు పెట్టినవాళ్లు కొందరు.. తాము రాజకీయాలకు గుడ్బై చెప్పేస్తునట్టు ప్రకటించారు.. కొందరు గత వివాదాల్లో కేసులు ఎదుర్కొంటుండగా.. ఇంకా కొందరు ముందుగానే క్షమాపణలు కోరుతున్నారు.. అయితే, ఈ వ్యవహారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవీ ఈవేళ రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా? అని ప్రశ్నించారు.. సొంత చెల్లినే బయటకు నెట్టేసిన వాడు.. ప్రజలకు ఏమీ చేస్తాడు..? ప్రజలకు ఏమీ చెబుతానని జనంలోకి వస్తాడు..? అంటూ నిలదీశారు.. ఇక, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మాజీ బుచ్చయ్య చౌదరి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు..
Read Also: Bigg Boss 8 Prithviraj Shetty: ఏంటి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ప్రేమను అంత మాట అనేసావ్!
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
ఇక, అదానీ ద్వారా సికి నుంచి విద్యుత్ కొనుగోలులో అవినీతి జరగలేదా.. ? అప్పుడు సీఎంగా వున్నది జగన్ కాదా..? అంటూ ప్రశ్నించారు బుచ్చయ్యచౌదరి.. ఎఫ్ బిఐఎఫ్ఐఆర్ లో జగన్ మీద ఆరోపణలు చేస్తే తన మీద కాదంటారా అంటూ మండిపడ్డారు. వైసీపీలో వున్న దోపిడీ దొoగలను ఎరిపారేస్తామని అన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పుడు ఒప్పందాలపై విచారణ జరుగుతోందన్నారు.. తప్పులుంటే చర్యలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. తప్పుడు ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. 25 ఏళ్లలో లక్షా 25 వేల కోట్లు రాష్ట్రానికి నష్టం కల్గుతుందన్నారు. అదానీతో సౌర విద్యుత్ కొనుగోలులో రాష్ట్రానికి అదా చేసానని చెబుతూ సన్మానం చేయాలని అడుగుతావా అంటూ మండిపడ్డారు. ఆర్ధిక విధ్వంసం చేసినందుకు సన్మానించాలా? అని ఫైర్ అయ్యారు.. నాడు సీఎంగా నీవు లేవా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాటు చేశామని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినదానికి నువ్వు కారణం కాదా? అని నిలదీశారు.. రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయలేదా…? ఏమీ చేశావు అని నీకు సన్మానం..? ఎందుకు చేయాలి అన్నారు. ఎక్కడిక్కడే ప్యాలెస్ లు కట్టుకుని పేదవాడివా.., రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసి వేల కోట్లు తినేస్తున్నారని విమర్శించారు. అధికారులు అలసత్వం వదిలేయాలి.. ఇంకా పాత బాటలోనే వుంటే చర్యలు వుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం తిడితే మేం పడలేదా..? అని ప్రశ్నించారు.. చర్యలు చేపడితే వక్రభాష్యం చెపుతారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి య్యచౌదరి..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!