YSRCP: జగన్కు మిథున్రెడ్డి సోదరుడి లాంటి వారు.. కొమ్మలు నరికితే చెట్టు బలహీనపడుతుందనే అరెస్ట్..!
- వైఎస్ జగన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు..
- కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే ..
- మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్. ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మదనపల్లి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు మేకా శేషుబాబు, మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ షేక్ నజీర్ హమీద్ ములాఖాత్ లో కలిశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. కొమ్మలను నరికేస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబమని, వారికంటే ప్రజలకు మీరు సేవ చేసి చూపించండి అని సవాల్ చేశారు.
Read Also: Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
ఇక, ఏపీ మద్యం కేసును.. ఢిల్లీ లిక్కర్ కేసుతో పోలుస్తున్నారు.. మద్యం పాలసీ గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైందన్నారు నిస్సార్ అహ్మద్.. గతంలో ప్రభుత్వ ఆదాయం భారీగా వచ్చింది… ప్రస్తుత కూటమి హయాంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి విడగొట్టడానికే మిథున్ రెడ్డిని జైలుకు పంపారని, మిథున్ రెడ్డి పై పెట్టిన కేసులు నిరూపితం కావు… కడిగిన ముత్యంలా ఆయన బయటికి వస్తారని.. దమ్ముంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయండి.. తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు అంటూ హితవు పలికారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్.
మరోవైపు, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతీయటానికే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని మండిపడ్డారు.. అనంతపురం జిల్లాలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నరేష్ కుమార్ రెడ్డి.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!