Teacher MLC By Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఫలితాలపై ఎవరి లెక్కలు వారివే..!
- ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..
- 93 శాతం పోలింగ్ నమోదు.. ఈ నెల 9వ తేదీన కౌంటింగ్..
Teacher MLC By Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు. ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఓటర్లు.. ఎమ్మెల్సీ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి జిల్లాలో 11 మండలాల్లో ఓటర్లు ఉన్నారు.
Read Also: IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
అయితే, పోల్ అయిన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లు విజయం సాధిస్తారు. అలా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. గత ఎన్నికల్లో షేక్ సాబ్జీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఈ సారి కూడా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను కాకినాడ జేఎన్టీయూకు తరలించారు. ఇక, ఈ నెల 9వ తేదీన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. కాగా, గురువారం రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే.. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 16,737 మంది టీచర్లు ఉండగా.. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదు అయ్యింది..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో