మరిన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు పెంచే యోచనలో రైల్వే శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో ఆగిపోయిన రైళ్లలో జనరల్ టిక్కెట్లను తిరిగి దశల వారీగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే చాలా రైళ్లలో కరోనా కారణంగా జనరల్ టిక్కెట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా రైళ్లు తిరిగి ప్రారంభం అయినా కేవలం రిజర్వేషన్ టిక్కెట్ సౌకర్యం మాత్రమే రైల్వే శాఖ కల్పించింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సొంత వాహనాలు, లేదా బస్సులను ఆశ్రయించారు. అయితే తాజాగా కొన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు ఇవ్వడానికి రైల్వే శాఖ ఓకే చెప్పింది.
Read Also: అనీమియా ముక్త్ భారత్ను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోంది: NVSS ప్రభాకర్
Also Read
దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అన్ని స్టేషన్లలోని జనరల్ కౌంటర్స్లో ఈనెల 21 నుంచి టిక్కెట్లను విక్రయించనుంది. రాయగడ- గుంటూర్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం- రత్నాచల్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లకు జనరల్ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని డైలీ ఎక్స్ప్రెస్లలో జనరల్ టిక్కెట్లను రైల్వే శాఖ ఇస్తుంది. గూంటూరు -సికింద్రాబాద్ గొల్కొండ ఎక్స్ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్, శాతవాహన సూపర్ఫాస్ట్ఎక్స్ప్రెస్, గూంటూరు- సికింద్రాబాద్ ఇంటర్సీటీ సూపర్ఫాస్ట్ రైళ్లకు ఇప్పటికే రైల్వే శాఖ జనరల్ టిక్కెట్లను ఇస్తుంది.
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..