మన దేశంలో… పెట్రోల్, వంట గ్యాస్, వంట నూనెలతో సహా కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ ఆకాశన్నంటుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు టమాటో ధరలు రూ.150 చేరుకోగా.. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా అదే దారి పడుతున్నాయి. అయితే.. తాజాగా… చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తుగూతాయి. వీలైతే ఒక్కొక్కడికి 30 రూపాయల పైన పలికింది.
గత మాసంలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మునగ చెట్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో తమిళనాడు రాష్ట్రం నుంచి మునగకాయలు దిగుమతి అవుతున్నాయి. వంగ, బీర, కాకర, బీన్స్, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లో కిలో 80 రూపాయల నుంచి 180 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ధరలు పెరుగుతూ పోతే తమ రోజువారి జీవితం ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.