Doctor Donates her Entire Property: వైద్యురాలి ఔదార్యం.. ఆస్పత్రికి రూ.20 కోట్ల ఆస్తి విరాళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైద్యురాలు తన యావదాస్తిని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయినవారికి కూడా దూరం అవుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అయితే, అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని తనకున్న రూ.20 కోట్ల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్కు దానం చేశారు.. తన కోసం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగ్చుకోకుండా.. మొత్తం తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్కు ఇచ్చేశారు.. రూ. 20 కోట్ల విలువైన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా.. అమెరికాలో స్థిరపడ్డారు.. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలి్స్టగా పనిచేస్తున్న ఆమె.. గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ పూర్తి చేశారు.. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు.. అంతేకాదు.. స్పెషలిస్ట్ డాక్టర్గా అక్కడే స్ధిరపడ్డారు.. అయితే, డల్లాస్ వేదికగా గత నెలలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్ సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఉమ.. తాను మెడిసిన్ చేసిన జీజీహెచ్కు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తన వద్ద లేకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆమె విరాళంగా ఇచ్చారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
2008లో వైద్యురాలైన ఉమ ‘జింకానా’ అధ్యక్షురాలిగా పనిచేశారు.. ఇక, ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు పేర్కొన్నారు.. కానీ, ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు… దీంతో, ఆమె భర్త.. డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్ను పెట్టాలని నిర్ణయించారు వైద్యులు.. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి, ఎనస్థటి్స్టగా సేవలు అందించిన కానూరి రామచంద్రరావు.. మూడేళ్ల కిందట ప్రాణాలు విడిచారు.. ఆమెకు వారసులు కూడా లేరు.. దీంతో డాక్టర్ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్కు ఇచ్చేశారు. ఏదేమైనా.. వైద్యురాలి నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. తమ ఆస్తిలో సగం.. 60 శాతం.. చివరకు 90 శాతం వరకు విరాళంగా ఇచ్చినవారు ఉన్నారు.. కానీ, డాక్టర్ ఉమ మాత్రం తన యావదాస్తిని మొత్తం దానం చేసి వార్తల్లో నిలిచారు. ఇక, ఆమె నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!