Devineni Uma: అదే జరిగితే.. జగన్ జైలుకి వెళ్లడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రివర్స్ టెండరు పై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం అధారిటీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని, రివర్స్ టెండరుపై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్తారన్నారు. అయితే.. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ముందస్తు సమాచారం లేకుండా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. పేదప్రజలు పశువులు కొట్టుకు పోయాయని, ఇళ్ళు, డబ్బు, వస్తువులు వదులుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవల్సిన పరిస్థితి వొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ బారికేడ్లు కట్టుకుని, కార్డ్ లు ఇచ్చి పరామర్శలు చేసిన దుస్థితిలో ఉన్నారని అన్నారు.
read also: Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్ కు అందుకే రాలేదు..
Also Read
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
ధవలేశ్వరం ఎస్.ఈ ఎందుకు సెలవు పై వెళ్లారని ప్రశ్నించారు. వరదలు ముంచెత్తుతున్నాయని, వరదలు వొచ్చే సమయంలో డ్రేజింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి పెట్టాలని, వరద సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమా.. లేక లంక ప్రజల ప్రాణాలు ముఖ్యమా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా.. గత మూడు ఏళ్ల లో వరద సాయం ఇస్తా అన్నారు, మరి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు రోజుల పర్యటన చేశారని, మరి.. ఆ ప్రాంతాల్లో సీఎం రెండు రోజుల పర్యటన చేయగలరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకుందని విమర్శిస్తూ ట్వీట్ వేదికగా మండిపడ్డారు.
లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకున్న @ysjagan రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు. pic.twitter.com/5TbJGct1uZ
— Devineni Uma (@DevineniUma) July 31, 2022
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!