Devineni Uma: అదే జరిగితే.. జగన్ జైలుకి వెళ్లడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రివర్స్ టెండరు పై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం అధారిటీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని, రివర్స్ టెండరుపై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్తారన్నారు. అయితే.. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ముందస్తు సమాచారం లేకుండా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. పేదప్రజలు పశువులు కొట్టుకు పోయాయని, ఇళ్ళు, డబ్బు, వస్తువులు వదులుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవల్సిన పరిస్థితి వొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ బారికేడ్లు కట్టుకుని, కార్డ్ లు ఇచ్చి పరామర్శలు చేసిన దుస్థితిలో ఉన్నారని అన్నారు.
read also: Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్ కు అందుకే రాలేదు..
Also Read
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
ధవలేశ్వరం ఎస్.ఈ ఎందుకు సెలవు పై వెళ్లారని ప్రశ్నించారు. వరదలు ముంచెత్తుతున్నాయని, వరదలు వొచ్చే సమయంలో డ్రేజింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి పెట్టాలని, వరద సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమా.. లేక లంక ప్రజల ప్రాణాలు ముఖ్యమా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా.. గత మూడు ఏళ్ల లో వరద సాయం ఇస్తా అన్నారు, మరి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు రోజుల పర్యటన చేశారని, మరి.. ఆ ప్రాంతాల్లో సీఎం రెండు రోజుల పర్యటన చేయగలరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకుందని విమర్శిస్తూ ట్వీట్ వేదికగా మండిపడ్డారు.
లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకున్న @ysjagan రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు. pic.twitter.com/5TbJGct1uZ
— Devineni Uma (@DevineniUma) July 31, 2022
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!