Kottu Satyanarayana: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు.. 70 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Kottu Satyanarayana On Vijayawada Temple Development: దేవాదాయ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో సీఎం జగన్ మంజూరు చేసిన రూ.70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్ని రూ.27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్లుగా అన్నదానం భవనం నిర్మాణం చేపట్టామన్నారు. ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్నప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నామన్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ.20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్టెన్షన్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
Malaria: అమెరికాను భయపెడుతున్న మలేరియా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేసులు..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ వారం పిలుస్తున్నామని కొట్టు సత్యనారాయణ చెప్పారు. రూ.28 కోట్లతో స్టెయిర్కేస్, అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ.6 కోట్లతో పూజా మండపాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని టెండర్లు జులై రెండవ వారంలో పిలుస్తామన్నారు. విజయవాడ దేవాలయంలో ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. రూ.60 కోట్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ.14.70 కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధి పననులు సాగుతాయన్నారు. శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
Pune: ప్రపోజల్ని తిరస్కరించిందని గర్ల్ఫ్రెండ్పై కొడవలితో దాడి..
శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయని కొట్టు సత్యనారాయణ గుర్తు చేశారు. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వాటిని నిర్మించబోతున్నామని ఆనందం వ్యక్తపరిచారు. కాణిపాకంలో రూ.3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తున్నామని, రూ.4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశామన్నారు. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టామని, ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంది అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించామని చెప్పారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!