Dengue Danger Bells: ఏజెన్సీపై డెంగీ పడగ.. ఆస్పత్రుల్లో బెడ్ లు నిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలతో ఈ ఏడాది వర్షాకాలం అంతా ముగిసిపోయింది. ఇప్పుడు వరద నీరు బయటకు వెళ్లిపోయింది. బురద మాత్రం మిగిలింది. బురదతో పాటు దోమలు కూడా బాగా వ్యాపించాయి. విష జ్వరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లోని ఏజన్సీ ప్రాంతంలో వణుకు పట్టిస్తున్నాయి, గోదావరి వరదల కారణంగా గ్రామాలన్నీ నీట మునగడంతో ఏ గ్రామంలో చూసినా జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు, ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక బెడ్ కోసం చేతిలో సిలైన్ బాటిల్ పట్టుకొని రోగులు అటు తిరుగుతున్నారు, జ్వరాల బారిన పడిన వారితో హాస్పిటల్ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఏజన్సీ లో కనిపిస్తున్న వైనంపై ఒక రిపోర్ట్.
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో విషజ్వరాల పరిస్థితి దారుణంగా ఉంది. డెంగీ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తుంది, వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇళ్లకు చేరుకున్న వరద బాధితుల తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు, వరదలు తగ్గుముఖం పట్టి 15 రోజుకు గడుస్తున్నా కనీసం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు కూడా పెట్టలేదని గిరిజనులు వాపోతున్నారు, చింతూరు ఏరియా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది, రోజు 100 కు పైగా జ్వర పీడితులు ఆసుపత్రికి వస్తే అందులో 10 నుండి 20 మంది డెంగీ బాధితులు ఉంటున్నారు. ఆసుపత్రిలో డెంగీ టెస్ట్ కిట్లు లేకపోవడంతో 700 నుండి 1000 రూపాయలు చెల్లించి బయట టెస్టులు చేయించుకోవలసి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
Read Also: ED Raids 6 locations: ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఈడీ నజర్.. ఆరుచోట్ల ఈడీ తనిఖీలు
విలీన మండలాల్లో ఏరియా ఆసుపత్రి పేరుకు మాత్రమే ఉందని అందులో కనీసం ఒక్కరంటే ఒక్కరూ కూడా పూర్తి స్థాయి వైద్యుడు లేరని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విలీన మండలాల్లో ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు లేకపోవడంతో స్థానికంగా ఉన్నా RMP వైద్యులను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు, గిరిజన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ITDA కనీసం స్థానిక గిరిజనులు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోవడం లేదని అసలు ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ, ఉందా లేదా అంటూ స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత గ్రామాల్లో బురద నిండిపోయి ప్రజలు డెంగ్యూ భారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ITDA అధికారుల్లో చలనం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆసుపత్రిలో వైద్యం చెయ్యడానికి డెంగ్యూ కిట్లు లేవని, మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని 2000 ఇంజక్షన్లు కావాలని అడిగితే 20 మాత్రమే వస్తున్నాయని వైద్యులు వాపోతున్నారు ఈ చాలీచాలని మందులతో ఎలా వైద్యం చెయ్యాలని అంటున్నారు.
Read Also: Sheikh Hasina India Visit: ఘనస్వాగతం పలికిన మోదీ.. అదే ప్రధాన లక్ష్యమన్న హసీనా
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!