Sheikh Hasina India Visit: ఘనస్వాగతం పలికిన మోదీ.. అదే ప్రధాన లక్ష్యమన్న హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Meets Bangladesh PM Sheikh Haseena: నాలుగు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మన భారతదేశానికి వచ్చారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కి చేరుకోగా.. ప్రధాని మోదీ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. భారత్ తమ మిత్ర దేశమని, భారతదేశానికి వచ్చినప్పుడల్లా తనకు చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని, తమ విముక్తి యుద్ధంలో భారత్ చేసిన సహకారాన్ని ఎన్నటికీ మరువమని, ఒకరికొకరు తాము సహకరించుకుంటామని పేర్కొన్నారు. మోదీతో జరిపే చర్చలు సఫలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన బంగ్లా ప్రధాని.. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్నేహంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలరని, దానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఇక ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నామని షేక్ హసీనా తెలిపారు. ఈ సమస్యలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నామని తాను భావిస్తున్నానని, తద్వారా భారత్ – బంగ్లాదేశ్లోని ప్రజలతో పాటు దక్షిణ ఆసియా జనాలు మెరుగైన జీవితాలను పొందగలుగుతారని చెప్పారు. ఇదే సమయంలో.. కొవిడ్ కాలంలోనూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ భారత్ అందించిన సాయం గొప్పదని షేక్ హసీనా కొనియాడారు. కాగా.. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో షేక్ హసీనా, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. కొన్ని అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, నదీ జలాల భాగస్వామ్యం సహా పలు కీలక రంగాలలో భారత్తో బంగ్లాదేశ్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. చివరిసారిగా బంగ్లాదేశ్ ప్రధాని 2019లో భారత్ని సందర్శించారు.
Also Read
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..