Sheikh Hasina India Visit: ఘనస్వాగతం పలికిన మోదీ.. అదే ప్రధాన లక్ష్యమన్న హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Meets Bangladesh PM Sheikh Haseena: నాలుగు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మన భారతదేశానికి వచ్చారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కి చేరుకోగా.. ప్రధాని మోదీ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. భారత్ తమ మిత్ర దేశమని, భారతదేశానికి వచ్చినప్పుడల్లా తనకు చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని, తమ విముక్తి యుద్ధంలో భారత్ చేసిన సహకారాన్ని ఎన్నటికీ మరువమని, ఒకరికొకరు తాము సహకరించుకుంటామని పేర్కొన్నారు. మోదీతో జరిపే చర్చలు సఫలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన బంగ్లా ప్రధాని.. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్నేహంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలరని, దానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఇక ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నామని షేక్ హసీనా తెలిపారు. ఈ సమస్యలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నామని తాను భావిస్తున్నానని, తద్వారా భారత్ – బంగ్లాదేశ్లోని ప్రజలతో పాటు దక్షిణ ఆసియా జనాలు మెరుగైన జీవితాలను పొందగలుగుతారని చెప్పారు. ఇదే సమయంలో.. కొవిడ్ కాలంలోనూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ భారత్ అందించిన సాయం గొప్పదని షేక్ హసీనా కొనియాడారు. కాగా.. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో షేక్ హసీనా, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. కొన్ని అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, నదీ జలాల భాగస్వామ్యం సహా పలు కీలక రంగాలలో భారత్తో బంగ్లాదేశ్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. చివరిసారిగా బంగ్లాదేశ్ ప్రధాని 2019లో భారత్ని సందర్శించారు.
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!