NTV Telugu Site icon

భీమిలి ప్రాంతంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ : మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్‌ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్‌డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.

భీమిలి ప్రాంతంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా సుమారుగా రెండు వేల పైబడి ఉపాధి కల్పించే వరకూ, కస్టమ్స్, ఎన్‌ఆర్‌ఆర్‌ఎంఎస్‌ ప్రకారం రాయితీలు ఇస్తామని, ఇప్పటికే పలు పరిశ్రమలకు రాయితీలు చెల్లించినట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమకు 30 కోట్లు మాత్రమే బకాయిలున్నాయి త్వరలో అవికూడ చెల్లిస్తామన్నారు. రేపు స్కిల్ డెవలప్మెంట్, నాస్కామ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఐటీ రంగం, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.