Gold Smuggling: ఏపీలో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Custom Officers Caught Huge Gold In Andhra Pradesh: ఏపీలోకి భారీగా స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారం స్మగ్లింగ్ అవుతోందని సమాచారం అందడంతో.. కస్టమ్స్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రూ. 11 కోట్ల విలువ చేసే బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని చేధించారు. నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లురుపేట, చిలకలూరి పేట తదితర ప్రాంతాల్లో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించారు. వంద మంది అధికారులతో 20 బృందాలుగా ఏర్పడి.. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి సుళ్లూరుపేట వస్తున్న ఒక వ్యక్తి నుంచి 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా వేర్వేరు ఆపరేషన్స్లో మొత్తంగా వేర్వేరు వ్యక్తుల నుంచి 13.189 కేజీల బంగారాన్ని అదుపులోకి తీసుకున్నారు. లెక్కల్లో చూపని రూ. 4.24 కోట్ల నగదును కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న బంగారంపై విదేశీ కంపెనీల గుర్తులూ ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ ఆపరేషన్లో మొత్తం నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారిని ఆర్ధిక నేరాల కోర్టులో హాజరుపరిచినట్టు కస్టమ్స్ విభాగం వెల్లడించారు.
ఈమధ్య గోల్డ్ స్మగ్లర్ల ఆగడాలు పెట్రేగిపోతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ… బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు ఏపీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో, కార్లలో తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా తనిఖీల్లో భారీ బంగారం పట్టుబడింది. ఒక్క రోజులోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడడంతో కస్టమ్స్ అధికారులు షాక్కి గురయ్యారు.
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!