Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ప్రధానిగా రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం..రాష్ట్రాల అభివృద్ధి పర్యటన కాదు..దురుద్ధేశ్య పర్యటన..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంది..తెలంగాణ లో పార్టీ అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఇక్కడ పర్యటించారు.. 24 నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉంది..రామగుండం సభలో సింగరేణి ప్రైవేట్ చేయడం లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారు..49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది ఉంది..2015 లో చట్టాన్ని మార్చారు.. 240 మైన్స్ లో 95 మైన్స్ ప్రయివేటు వాళ్ళకిచ్చారన్నారు నారాయణ.
Read ALso: Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
డెక్కన్ వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు ప్రయివేటు వాళ్ళకి ఇవ్వొద్దని ఒప్పందం ఉంది..4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి కమర్షియల్ మైన్స్ కి ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు..రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే ప్లాన్ చేశారు..దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు..లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉండే సింగరేణి లో ఇప్పుడు 40 వేల మంది మాత్రమే ఉన్నారు..ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు..అంబానీ,ఆదాని లాంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారు..ఏడున్నర ఏళ్ల క్రితం ఆధాని కి ఏడు వేల కోట్ల అప్పుగా ఉండేది..దానిని బ్యాంకు లు నమ్మలేదు..ఇప్పుడు ప్రపంచంలోనే రెండోస్థాయి కి ఎదిగారు..
ప్రపంచంలోనే కుంభకోణాలకు నాయకత్వం వహించేంది మోడీనే.. 29 మంది లక్షల కోట్లు కొల్లగొట్టిపోయారు..అవినీతి పరులను అంతమొందిస్తానన్న మోడీకి ఆధాని కనబడడం లేదా..పోర్టులు ఆధాని సొంతం అయిపోతున్నాయి..పోర్టుల ద్వారా డ్రగ్స్ సప్లయ్ జరుగుతుంది..సీబీఐ,ఈడీ దాడులు దురుద్ధేశ్యం తో చేస్తున్నారు..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు చేయరు..మొన్నటి వరకు కేసీఆర్ బీజేపీ కి దగ్గరగా ఉన్నారు..రాష్ట్రాల హక్కులు కొల్లగొట్టడం వల్లే తిరగబడ్డారు..మునుగోడు లో టీఆరెస్, వామపక్షాల ఉమ్మడి వ్యూహం ఫలించింది..కమ్మునిస్ట్ లు అమ్ముడుపోయారని చెబుతున్నారు.. బీజేపీ ని వ్యతిరేకించడానికి మద్దతు ఇచ్చాము..
ఎలాంటి ప్యాకేజి లతో మాకు సంబందం లేదు..నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే ఆధారాలతో బయటపెడితే… ఎదురుదాడి చేస్తున్నారు..ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం..రాజధాని కి నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, ప్యాకేజి దేనిపై కూడా మోడీ హామీలు ఇవ్వలేదు.రాజకీయాలకు అతీతంగా దండం పెట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు..రాజకీయాలకు అతీతంగా అంటే 420 ..
జగన్మోహన్ రెడ్డి తెలుగులో చెప్పాడు.. మోడీకి తెలుగు రాదు..జగన్మోహన్ రెడ్డి అడిగిన ఏ ఒక్కటి కూడా ఇస్తా అని మోడీ చెప్పలేదు..3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మేసి 11 వేల కోట్లు రోడ్లకు అంటే ఎవరు నమ్ముతారు..ఏపీ లో ysrcp బలంగా ఉండాలి టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప బీజేపీ బలపడదని మోడీ ప్లాన్..పవన్ కళ్యాణ్ ని 3 రోజుల క్రితమే కలవమని పిఎంవో నుండి సమాచారం ఇచ్చారు..రాబోయే రోజుల్లో కమ్మునిస్ట్ పార్టీలు బలపడాలి..బీజేపీ బలహీనపడలి. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తాం..సీపీఐ నిరసన సక్సెస్ అయింది.. రెండు రాష్ట్రాల్లో వేలాదిమంది ని అరెస్ట్ చేశారు..మోడీ స్వయంగా సింగరేణి ప్రైవేట్ చేయమని ఒప్పుకున్నారు..కేసీఆర్ ని వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు పోలీసులు మా పార్టీ కార్యాలయంలో కి రాలేదు..ఢిల్లీ లో లా అండ్ ఆర్డర్ మోడీ చేతిలో ఉన్నట్టే..తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ మోడీ కి అప్పగించారేమో అనిపించింది..తెలంగాణ పోలీసులను కేసీఆర్ మోడీకి అప్పగించారా? అని ప్రశ్నించారు నారాయణ.
Read Also:Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!