CPI Narayana: మోటార్లకు మీటర్లు పెడితే.. వేళ్లు నరికేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Again Fires On YS Jagan Over Meters Issue: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే.. వాటిని పెట్టడానికి వచ్చిన అధికారులతో పాటు సిబ్బంది వేళ్లు నరికేయండని రైతుల్ని సూచించారు. బుధవారం సాయంత్రం చిత్తూరులో నిర్వహించిన జిల్లా రైతు సదస్సులో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. ఆయన కొడుకు జగన్ మాత్రం మోటార్లకు మీటర్లు బిగించడం ఏమాత్రం సబబు కాదన్నారు. రాజన్న పాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. రాజన్న పాలన తెస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు రాజన్న మాటకు పంగనామం పెట్టారన్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే, వాటిని పగలగొట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని.. జగన్కి ఆ ధైర్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్.. కేంద్రానికి భయపడుతున్నారని అన్నారు. అప్పట్లో నిజాం నవాబు వస్తే.. రాజు వచ్చాడు, దూరంగా వెళ్లండని సైన్యం చెప్పేదని.. ఇప్పుడు అంతకుమించి వందలాది మంది పోలీసులతో జగన్ తిరుమలలో పర్యటించారని విమర్శించారు. ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల దాకా.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా జగన్ పర్యటన సాగిందన్నారు. వేల సంఖ్యలో పోలీసులు కాపలా కాశారని.. సీఎం జగన్కి ఎందుకంత అభద్రతా భావమని ప్రశ్నించారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
అంతకుముందు కూడా వైఎస్ జగన్పై సీపీఐ నారాయణ ధ్వజమెత్తారు. సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని.. సీఎం అయ్యాక మాట మార్చారని అన్నారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర, ర్యాలీలంటే జగన్కి ఎందుకంత కోపమని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్రలు చేసే మీరు (జగన్), వైఎస్సార్ ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!