పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో వారంతా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. సగానికి సగం ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడుతూ.. మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
read also : కరోనా తగ్గుముఖం.. జులై 19 తరువాత అన్ని ఆంక్షలు ఎత్తివేత
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
విశాఖకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరచూ వస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే వారిలో ఎక్కువమంది ఏజెన్సీ ప్రాంతాలను, జలపాతాలు, కొండ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో పొరుగు దేశాల నుంచి వందల మంది నగరంలోని టూరిజం స్పాట్స్ సందర్శనకు వస్తారు. కరోనా పుణ్యమా అని… రెండేళ్లుగా ఎవరూ రావడంలేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బుకింగ్ లతో బిజీబిజీగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ లు… ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సాధారణ రోజుల్లో నగరంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులన్నీసందడిగా ఉండేవి. వాహనాల గిరాకీతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలు నిర్వహించేవారు. కరోనా వల్ల జనం ఎంతో అత్యవసరమైతే తప్ప ఎక్కడా బయటకు వెళ్లడం లేదు. దూర ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పర్యాటక వ్యాపారాల మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక సంస్థల నిర్వహణ, ఉపాధికల్పన భారంగా మారుతోంది. ఈ సమయంలో పన్ను విరమణ, ఇతర మినహాయింపులిచ్చి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!