ఏపీలో కరోనా విశ్వరూపం… నిబంధనలు పాటించని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. నెల క్రితం వందల్లో వున్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. తాజాగా ఏపీలో కరోనా భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరు, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కరోనా కట్టడిపై అధికారులు చేతులెత్తేశారేమో అనిపిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు, తెరుచుకున్న సినిమా థియేటర్లతో పాటు సందడి ఎక్కువైంది. మూడు నెలలుగా కరోనా కొత్త వేవ్ వస్తుందని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదేమో అనిపిస్తోంది.
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నా వ్యాక్సిన్ వేయించుకున్న ధీమానో ఏమో తెలీదు గానీ కరోనాను లైట్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాధిని అరికట్టడంలో అధికారులు సైతం చిత్తశుద్ధి చూపించడం లేదు. తెరుచుకున్న సినిమా థియేటర్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఒకటేంటి ..ఇప్పుడు ఏకంగా ఎగ్జిబిషన్ లు కూడా పెట్టి కరోనాను వైఫై మాదిరిగా ఇంటింటికి పంపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులవారు కనీస బాధ్యత, స్పృహ లేకుండా కరోనాని కాసుల కలెక్టింగ్ కి వాడేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా బహిరంగంగా అ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే, 200మంది లోపు ప్రజలు వచ్చేలాగా కరోనా నిబంధనలు పాటించే లాగా ఆంక్షలు ఉన్నాయి… ప్రభుత్వ కార్యక్రమాలు అయితే కొంతమేర పర్లేదు, అక్కడ కచ్చితంగా కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు . కానీ కొందరు అసలు నిబంధనలు పాటించడం లేదు.
గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు నమోదయ్యాయి.కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!