NTV Telugu Site icon

Cyclone Sitrang: ఏపీవైపు దూసుకొస్తున్న ‘సిత్రాంగ్‌’..! అప్రమత్తమైన అధికారులు, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు..

Cyclone Sitrang

Cyclone Sitrang

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది… ఇవాళ అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. క్రమంగా వాయుగుండంగా మారుతోంది అల్పపీడనం… రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది… అనంతరం సిత్రాంగ్‌ తుఫాన్ గా బలపడనుంది వాయుగుండం… ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది… వాయుగుండంగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచేఅవకాశం ఉండగా.. అక్కడక్కడా ఓ మోస్తరు లేదా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. 24 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడిన తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో 25 తర్వాత బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులు శనివారం నుంచి సోమవారం వరకు ఒడిశా వైపు చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించింది వాతావరణశాఖ..

Read Also: Astrology : అక్టోబర్‌ 22, శనివారం దినఫలాలు

ఇక, తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నారు అధికారులు.. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. జిల్లా కలెక్టర్ కార్యాలయం, అమలాపురంలో 08856 293104, వాట్సాప్ నంబర్ : 99495 15348, అమలాపురం ఆర్డీవో కార్యాలయం: 08856 233100, రామచంద్రాపురం ఆర్డీవో కార్యాలయం : 08857 245166, కొత్తపేట ఆర్డీవో కార్యాలయం: 9059461848 నంబర్లతో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు.