YSR Law Nestham: లాయర్లకు సీఎం జగన్ గుడ్న్యూస్.. రేపే ఖాతాల్లోకి సొమ్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Law Nestham: రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్నవారికి వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ది చేకూరనుంది.. అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో బుధవారం రోజు అంటే ఈ నెల 22వ తేదీన రూ. 1,00,55,000 ను వర్చువల్ గా జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది జగన్ సర్కార్.. మూడున్నరేళ్లలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద.. మొత్తంగా రూ. 35.40 కోట్లు ఆర్ధిక సాయం చేసింది ప్రభుత్వం..
Read Also: Off The Record: కంటోన్మెంట్ సీటుపై నేతల ఆశలు..! పోటీకి ఆ ముగ్గురు తహతహ..!
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
కాగా, లాయర్లకు స్టైఫండ్ ఇచ్చే పథకానికి వైఎస్సార్ లా నేస్తంగా పేరు పెట్టిన విషయం విదితమే.. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన ఈ పథకాన్ని శ్రీకారం చుట్టూరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు.. దాదాపు మూడేళ్ల పాటు.. నెలకు రూ.5000 ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తూ వస్తున్నారు.. అర్హులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. లా డిగ్రీతో పాటు జనన ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.. సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్ను పొందుపరచాలి. దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంక్ అకౌంట్ వివరాలను పొందుపర్చాలి.. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం ఉన్న సీనియర్ లాయర్లు, బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
తాజావార్తలు
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
-
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!