Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Mohan Reddy Sensational Comments On Chandrababu And Pawan Kalyan

YS Jagan Mohan Reddy: రాజకీయాలు చెడిపోయాయి.. వారికి మరో ఛాన్స్‌ ఇవ్వొద్దు..!

NTV Telugu Twitter
Published Date :November 23, 2022 , 1:29 pm
By Sudhakar Ravula
YS Jagan Mohan Reddy: రాజకీయాలు చెడిపోయాయి.. వారికి మరో ఛాన్స్‌ ఇవ్వొద్దు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజకీయాలు చెడిపోయాయి.. లాస్ట్‌ ఛాన్స్‌ అంటూ వస్తున్నవారికి మరో ఛాన్స్‌ ఇవ్వొద్దని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, ఎంజీఆర్, వైఎస్‌ జగన్‌ అంటారన్న ఆయన.. పిల్లను ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారంటూ ఎద్దేవా చేశారు.. తమ ఆస్తిని అనుభవించేవారిని హక్కుదారుడు అంటాం.. పరాయి వారి ఆస్తిని కాజేసేవారిని కబ్జాదారుడు అంటామని.. రావణుడిని సమర్థించేవారిని రాక్షసులు అంటాం.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా? ఇలాంటి వ్యక్తికి మరోఛాన్స్‌ ఇస్తారా? మీ సేవలు వద్దు బైబై బాబు అని ఇంటికి పంపాలా? వద్దా? ప్రజలకు మోసం చేసిన బాబుని అసెంబ్లీకి పంపాలా..? మీ సేవలు వద్దు బాబు అని ఇంటికి పంపాలా? ఆలోచించాలని సూచించారు సీఎం వైఎస్‌ జగన్..

Read Also: Dharmana Prasada Rao: విశాఖ రాజధాని అయితే చంద్రబాబు వచ్చిన నష్టం ఏంటి..? బిజినెస్‌ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు..!

రాజకీయాలు చెడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్.. తనకు తాను పార్టీ పెట్టుకొని, వేరొకరికి సహాయం చేస్తున్నాడు దత్తపుత్రుడు అంటూ పవన్‌ కల్యాణ్‌ సెటైర్లు వేశారు. రాజకీయం అంటే జవాబుదారీతనం, మంచి చెస్తే ఉంటారు.. లేకపొతే తప్పుకుంటారని బావన రావాలి అన్నారు.. నేను దేవుడిని, ప్రజల్ని నమ్ముకుంటున్నానని వ్యాఖ్యానించారు.. ఇక, సబ్ రిజిస్ట్రేషన్ అంశంలో లంచాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. శాశ్వత భూహక్కు , భూ రక్ష కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.. రాష్ర్టంలో జరుగుతున్న మార్పును రైతులు గమనించాలి.. జగన్న భూ హక్కు అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.. లంచాలకు తావులేకుండా ఉండేందుకే పరిపాలనా‌ సంస్కరణలు తీసుకొస్తున్నాం.. గ్రామ సచివాలయాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా ఎన్నో కార్యాక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు.

నాడు రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉంటే.. నేడు 17 మెడికల్ కళాశాలలు కడుతున్నామని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్.. రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. వెల్‌నెస్‌ సెంటర్లు, నాడు నేడు కింద స్కూళ్లు, గ్రామస్థాయిలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.. అక్కచెల్లెమ్మల భద్రతకు దిశా యాప్ తీసుకొచ్చాం.. దీని ద్వారా పోలీసులు చెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నారని తెలిపారు.. ఐదేళ్ల చంద్రబాబు, దత్తపుత్రుడు సంసారంలో కిడ్ని సమష్య గుర్తుకు రాలేదు.. అని మండిపడ్డ ఆయన.. తాము రూ.765 కోట్లతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం, కిడ్నీ బాధితులకు రూ.10 వేల పెన్షన్‌ కూడా ఇస్తున్నామన్నారు.. కిడ్ని రోగాల శాశ్వత పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. గతంలో 295 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సేవలలించేవారు.. నేడు 11,000 గ్రామసచివాలయాలను రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మారుస్తున్నాం అన్నారు సీఎం జగన్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • CM YS Jagan Mohan Reddy
  • janasena
  • pawan kalyan

తాజావార్తలు

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • YS Jagan: ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి!

  • Kuberaa : కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్..

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Tejeshwar Murder: తేజేశ్వర్ హత్యపై కొత్త ట్విస్ట్.. బయటపడిన కాల్ రికార్డులు..!

ట్రెండింగ్‌

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • HONOR X9C 5G: డిజైన్‌లో క్లాస్, పెర్ఫార్మెన్స్‌లో దమ్మున్న ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..!

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions