Balineni Meets CM Jagan: సీఎం జగన్ భరోసా.. బాలినేని అలక వీడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కాకరేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడారు. గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవిని కోల్పోయారు. ఇటీవల ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి.
Read Also: Gangula Kamalakar: రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే, సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన పార్టీ వ్యతిరేకులతో తిరుగుతున్నారని, బాలినేనిపై ఫిర్యాదులు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు బాలినేని గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.
తాజాగా సీఎం జగన్- బాలినేని భేటీ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు బాలినేని. మీడియా కంటపడకుండా క్యాంపు కార్యాలయానికి రెండో వైపు నుంచి వెళ్ళారు. జగన్ తో భేటీ తర్వాత బాలినేని నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. స్థానికంగా తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారని తెలుస్తోంది. నియోజకవర్గానికే పరిమితం అవుతానని చెప్పారు బాలినేని. బాలినేని ప్రస్తావించిన అంశాలన్నింటి పై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని బాలినేనికి భరోసా ఇచ్చిన సీఎం..ముఖ్యమంత్రితో భేటీ అనంతరం నేరుగా హైదరాబాద్ కు బయలుదేరారు బాలినేని… జిల్లాలో ప్రోటోకాల్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు సీఎం జగన్. తనకు రీజనల్ కోఆర్డినేటర్ పదవి వద్దని సీఎంకు స్పష్టం చేశారు బాలినేని. సీఎం హామీతో బాలినేని అలక వీడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Read Also: Human Brain: చనిపోయే ముందు మానవ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా..? అధ్యయనంలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!