CM Jagan: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Interesting Comments: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో పర్యటిస్తున్న సీఎం జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఆరు, ఏడు నెలల్లోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. మాతో సంబంధం లేకుండా.. నేరుగా కేంద్రం నుండి నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు వేయాలని కోరామన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా అన్ని మాకిచ్చేయండి చేసేస్తామని చెప్పడం లేదన్నారు. ప్రాజెక్టుకు డబ్బులిస్తే చాలు, నిర్వాసితులకు అవసరం లేదని చంద్రబాబులా చెప్పమని అన్నారు.
Rahul Gandhi: 137 రోజుల తర్వాత పార్లమెంటుకు రాహుల్ గాంధీ.. లభించిన ఘనస్వాగతం
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఈ నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ పోలవరం మొదటి దశ పరిహారానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే బటన్ ప్రధాని మోడీ నొక్కినా పర్వాలేదన్నారు. ఎన్నికల్లోపే.. అంటే వచ్చే ఆరేడు నెలల్లోనే పోలవరం మొదటి దశ పరిహారం పూర్తవుతుందన్నారు. మరో 48 ఆవాసాలను మొదటి దశ పరిహారంలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించామన్నారు. 41.15 మీటర్లకు మొదటి దశ పోలవరం పూర్తవుతుందన్నారు. పోలవరం డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం మూడు దశల్లో నీళ్లు నింపాలన్నారు. కేంద్రం ఇచ్చే 6.8 లక్షలకు, రాష్ట్రం వాటా 3.2 లక్షలు కూడా కలిపి ఇస్తామన్నారు. పోలవరం రెండు, మూడు దశల్లో కూడా ఇదే రకంగా పరిహారం పూర్తి చేస్తామన్నారు. పోలవరం పరిహారం కోసం తాను గట్టిగా కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వాలు లాగా అన్ని తానే చేయాలని అనుకోవడం లేదని కౌంటర్లు వేశారు.
2013 రెట్లకు పోలవరం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం పెట్టారని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం విషయాలన్నీ తాను చెప్పినట్టు కచ్చితంగా జరుగుతాయన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందిస్తామన్నారు. ఇప్పటికే బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, కూరగాయలు అందిస్తున్నామని తెలిపారు. ఇల్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేల ఆర్థియ సహాయం చేస్తామన్నారు. గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ఉంచుతామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!