Site icon NTV Telugu

Andhra Pradesh: రైతులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Cm Jagan

Cm Jagan

ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు.

YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున నిర్వహించేలా కసరత్తు

మరోవైపు ఏపీలో రోడ్ల మరమ్మతులపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రూ.2,500 కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని.. పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఎక్కడా కూడా గుంతలు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో కనీసం రూ.1,400 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్లను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సూచించారు. ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అటు జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం విప్లవాత్మకమైనదని జగన్ అభివర్ణించారు. సుమారు 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది అని.. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

Exit mobile version