అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయండి : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోర్టులు, ఎయిర్పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల పురోగతి పై సీఎంకు అధికారులు వివరాలందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు జిల్లాలో 6 విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ అని, వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్పోర్టు ఉండాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండని, అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టాలని, బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండని, విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయందాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండని, నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
Also Read
రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల పనుల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. పనులు వేగవంతం చేయాలని జగన్ సూచించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 9 ఫిషింగ్ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4 ఫిషింగ్ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, జువ్వలదిన్నె జిల్లాల్లో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం చేస్తుండగా, రెండో విడతలో మిగిలిన 5 హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..