Site icon NTV Telugu

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. వృద్ధిరేటు పెంపుపై చర్చ!

Cbn

Cbn

CM Chandrababu: ఇవాళ (డిసెంబర్ 10న) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశం జరగనుంది. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 45 గంటల వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించనున్నారు. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరగనుంది. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన చర్చిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో చర్చ జరుగుతుంది.

Read Also: Trmup: యూరోపియన్ దేశాలపై ఆగ్రహం.. జెలెన్‌స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!

ఇక, మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చ జరుగుతుంది. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సమీక్ష జరపనున్నారు.

Exit mobile version