Kurasala Kannababu: ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు..
- ఎక్కడైనా బెస్ట్ ఉంటే అది నాదేనని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు..
- చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొటడం అలవాటుగా మారింది..
- జగన్ చేసిన మంచి పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు: కన్నబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurasala Kannababu: చంద్రబాబు ఒక కాపీ నేత.. ఎక్కడైనా ఒక బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని ఇది నాదేనని చెప్పుకోవటంలో దిట్ట అని వైసీపీ మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. వైసీపీ రైతు భరోసా పథకానికి కాపీ.. రైతులను అప్పుల కోసం తిరగొద్దనే లక్ష్యంతో రైతు భరోసా పథకం తెచ్చిన జగన్.. గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం అలవాటు అయింది. కానీ, జగన్ ఇచ్చిన.. ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పథకం- పీఎం కిసాన్ కు అదనమని చెబుతున్నారు.. తొలి ఏడాది రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Read Also: Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
అయితే, గత వైసీపీ హయంలో 53 లక్షల మందికి పథకాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 7 లక్షల మందికి తగ్గటమంటే రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు.. లేకుంటే వలస వెళ్లారు.. వాళ్లకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదా.. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా.. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 53 లక్షల మందికి 34 వేల కోట్లకు పైగా ఇచ్చారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..
ఇక, ఇప్పటి వరకు రూ. 4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని కురసాల కన్నబాబు తెలిపారు. ఇవ్వాల్సిన దాని కన్నా ఇంచుమించి 17 వేలకోట్లు కోత పెట్టారు.. కూటమి ప్రభుత్వం రైతులకు మొత్తం 16,746 కోట్లు బాకీ పడింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసిన ఘటన జగన్ కి దక్కింది.. భూ యజమాని హక్కులు కాపాడుతూ సీసీఆర్సీ కార్డులు తీసుకువచ్చాం.. ఇప్పుడు కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయలేదు.. రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు.. అన్నీ సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు అందించిన ఘనత ఒక్క జగన్ దే.. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా వారిని కౌలు రైతులను చంద్రబాబు వదిలేశారని వైసీపీ నేత కన్నబాబు అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!