MLA Peddireddy: రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది..
- రాష్ట్రంలోని రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
- వ్యవసాయం దండగా అని సీఎం చంద్రబాబు పలుమార్లు అన్నారు..
- రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు. కోట్లల్లో చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారు.. తోతపురి కిలో 2 రూపాయలు, 3 రూపాయలు ధరలు పలికితే రైతులు ఎలా బతకాలి అని అడిగారు. ఎన్నిసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా రైతులకు పట్టించుకోడు.. వ్యవసాయం దండగ అని స్వయానా ఒక సీఎం కూర్చిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా చేయాలి.. మళ్ళీ గర్జించిన ఇరాన్ మాజీ యువరాజు
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
అయితే, ఇలాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు.. రైతులకు ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని అనుకుంటే అందరిని ఉసురు మనిపించింది అని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం.. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు.. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు సెలవుల్లో ఉండాల్సిందేనని విమర్శించారు. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది.. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?