Chandrababu: ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 4వేల పింఛన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికే ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేలా చేస్తామని అన్నారు. పింఛన్ ను నాలుగు వేలు పెంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు.
IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ విడుదల..
Also Read
మరోవైపు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల జాతి మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట అభివృద్ది కోసమే పొత్తులు పెట్టుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అజెండా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని తెలిపారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చెప్పారు. ఇప్పటివరకు మీరు తనపై ఏడుసార్లు అభిమానం చూపించారు.. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం అడ్డుపడిందని దుయ్యబట్టారు.
CM Jagan: ఎల్లుండి నుంచి ‘మేమంతా సిద్ధం’.. బస్సుయాత్ర చేపట్టనున్న సీఎం జగన్
ముప్పై ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ వెనక్కి తీసుకెళ్ళాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదన్నారు. ఈసారి కుప్పంలో టీడీపీకి లక్ష మెజార్టీ లక్ష్యం అని చంద్రబాబు తెలిపారు. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి