Chandrababu: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ.. యవతతో సమావేశంలో చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ ను నియమిస్తామని చంద్రబాబు అన్నారు.
Kakarla Suresh: సమిష్టిగా కృషి చేద్దాం.. విజయం సాధిద్దాం..!
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
గంజాయికో, జె.బ్రాండ్ మద్యానికి అలవాటు పడకండా మీ బంగారు భవిష్యత్తుకు ప్రయత్నిస్తున్నా.. యువత మేలుకోవాలని చంద్రబాబు సూచించారు. మీ జీవితాలను చీకటిమయం చేసిన జలగన్నను ఇంటికి పంపాలని విమర్శించారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని మోసం చేశారు.. రాష్ట్రంలో గంజాయి సాగుకు అధికారమైందని దుయ్యబట్టారు. ప్రతి కిరాణ దుకాణంలో గంజాయి దొరికే స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. లక్షల మంది యువత కలను నిర్వీర్యం చేస్తూ గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసిన సర్వీస్ కమిషన్ ఉద్యోగులను శిక్షిస్తామని తెలిపారు.
CJI DY Chandrachud: ఆ ప్రణాళికతో ముందుకు సాగితే ఉన్నత స్థానానికి చేరవచ్చు..
ప్రపంచమంతా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాను.. కరవు నిలయమైన అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిశ్రమ ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనుబంధ పరిశ్రమలు పారిపోయాయి.. కియా మోటార్ ద్వారా ఉద్యోగాలు తాను ఇప్పిస్తే.. భూమి ద్వారా రూ. పదివేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. 35 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్నా.. ఈ ఐదేళ్ల కాలంలో కుప్పం ఖనిజ సంపదను దోచుకొనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేజీఎఫ్ మించి గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో డ్రగ్ రహిత రాష్ట్రంగా మారుస్తానని చెప్పారు. యువత కసిగా ఓటేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో