NTV Telugu Site icon

Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు

Babu Kkd

Babu Kkd

జగన్ పాలనపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ బటన్ లు నొక్కి కాలయాపన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు. ఓడితే ఏ జైలు కి వెళ్తారో తెలియదు,ప్రజలు నెత్తిన అప్పులు వదిలి వెళ్తున్నారు. వైసీపీ సర్కార్ ఇంటికే అన్నారు చంద్రబాబునాయుడు. రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు. పోలవరాన్నీ గోదావరి లో కలిపేశాడు. ఇటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చంద్రబాబు మండిపడ్డారు.

Read Also: Pawan Kalyan: అంబులెన్స్ అడిగితే దిక్కులేదు… రాజధాని అభివృద్ధి చేస్తారట

ఐదు రూపాయలు కి రేషన్ బియ్యం కొని ఆఫ్రికా కి కాకినాడ ఎమ్మెల్యే ఎగుమతి చేస్తున్నాడన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ఈ దందా కి ఆద్యుడు. వేల కోట్ల రూపాయలు పెద్ద రేషన్ కుంభ కోణం జరుగుతోంది. ఎమ్మెల్యే తండ్రి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్. తోడుదొంగలు ఒకే ఇంట్లో ఉండి గూడుపుఠాణి చేస్తున్నారు. పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు చేస్తున్నాడు, ఎమ్మెల్యేకి ఆఫ్రికాలో కూడా గోడౌన్లు ఉన్నాయన్నారు చంద్రబాబునాయుడు. నేడు రెండో రోజు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం అయిన బాబు అనంతరం మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు