తప్పులు చేసి తిరిగి మా నేతలపై కేసులా..? చంద్రబాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన బాధ్యత ఆర్వోపై ఉందన్నారు. కానీ, ఎన్నికల అధికారులే దగ్గరుండి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
Read Also: కేసీఆర్కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?
కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ గొడవలు లేవు.. ఇలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా రౌడీయిజం చేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.. 14వ వార్డుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. స్క్రూట్నీలో అంతా బాగుందని చెప్పి.. ఆ తర్వాత ప్రకటించిన తుది జాబితాలో టీడీపీ అభ్యర్థుల పేర్లు తొలగించారని.. కుప్పం 14వ వార్డులో నామినేషన్ వేసిన వారు డాక్యుమెంట్లను కలెక్టరుకు కూడా పంపామన్నారు. మరోవైపు, నెల్లూరులో తప్పుడు సంతకాలతో విత్ డ్రా చేసేస్తారా..? తప్పుడు పనులు చేస్తున్న అధికారులకు సిగ్గుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని చొక్కా చిరేగేలా ఈడ్చుకుపోతారా..? తప్పులు చేసి తిరిగి మా నేతలపై కేసులు పెడతారా..? అని ప్రశ్నించిన ఆయన.. కుప్పంలో టీడీపీ నేతలెవరూ లేకుంటే రిగ్గింగ్ చేద్దామనుకుంటున్నారు అని విమర్శించారు.. అధికారుల ఫిర్యాదులో టీడీపీ నేతలు తనపై చేయి చేసుకున్నారనే విషయాన్ని ప్రస్తావించకున్నా.. డీఎస్పీ చేయి చేసుకున్నారని ప్రకటనలు ఇచ్చేస్తున్నారని.. ఇంత వరకు నా మంచి తనాన్నే చూశారు.. తప్పులు చేసిన అధికారులను వదిలేదే లేదు అని హెచ్చరించారు.. నెల్లూరులోనూ అదే తరహాలో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.. బీ-ఫారం తీసుకుని పార్టీ మారారట.. పార్టీ మారాలనుకుంటే ముందే మారేవారుగా..? అని ప్రశ్నించారు.. ఒత్తిడి, ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇలాంటి గెలపూ ఓ గెలుపేనా..? సిగ్గు లేదా..? ప్రజలు తిరగబడితే కుక్కను కొట్టినట్టు కొడతారా? పరిపాలించడం చేతకాకుంటే వదిలి పెట్టి పోండి.. కానీ, అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని తగులబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
తాజావార్తలు
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
-
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
-
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!