శాంతి భద్రతలు ఫెయిల్.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు నఅ్నారు.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం.. ఆ బంద్కు సహకరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.. ఇక, సీఎం వైఎస్ జగన్, డీజీపీ కుమ్మక్కై చేసిందే ఈ దాడి అని ఆరోపించారు చంద్రబాబు.. నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తారా..? అని నిలదీసిన ఆయన.. గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్లు ఎత్తుతారు కానీ.. డీజీపీ ఫోన్ ఎత్తలేనంత బీజీనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, నేనెప్పుడూ రాష్ట్రపతి పాలనను సపోర్ట్ చేయలేదు.. కానీ, ఇంతకంటే దారుణం ఏముంటుంది..? రాష్ట్రపతి పాలన పెడితే తప్పేంటీ అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారనేదే ప్రధాన సమస్య.. అందుకే కేంద్ర మంత్రికి ఫోన్ చేశాను అన్నారు చంద్రబాబు.. నేనెప్పుడన్నా బూతులు తిట్టానా..? అని ప్రశ్నించిన ఆయన.. బూతుల ప్రయోగంపై డిబేటి చేయండి.. ఎవరు దీన్ని ముందుగా మొదలు పెట్టారు.. నన్ను, మా నేతలను ఎన్ని బండ బూతులు తిట్టినా మేం సహించాం అన్నారు.. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఒకరిద్దర్ని చంపేస్తే పార్టీ కార్యాలయాన్ని మూసేస్తారా..? అని మండిపడ్డ ఆయన.. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది.. బాధ ఉంది.. అయినా నిగ్రహంతో ఉన్నాను. నా ఇంటిని తాళ్లతో కట్టేసినప్పట్నుంచి ఈ విధానం మొదలైందన్నారు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు.. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించిన ఆయన.. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారని.. పార్టీ కార్యాలయలపైనా దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు.. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారని ఫైర్ అయ్యారు. మరోవైపు.. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని విమర్శించిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం మా తప్పా..? ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే మేం ప్రశ్నించకూడదా..? పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..? పులివెందుల రాజకీయాలు చేస్తారా..? డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా..? పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది..? డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపిస్తున్నాం.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. అందరూ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!