YS Jagan: భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ.. మా హయాంలోనే వేగంగా పనులు జరిగాయి..
- భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ చేస్తున్నారు..
- ఎయిర్ పోర్టు పేరుతో భూ దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారు..
- భోగాపురం ఎయిర్ పోర్టుపై 139 కేసులు వేస్తే, పరిష్కరించి పనులు చేశాం..
- వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా చేశాం: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు.. 15 వేల ఎకరాల భూమి కావాలన్నారు.. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు.. మేం వచ్చాక 2,700 ఎకరాలకు కుదించి పనులు మొదలు పెట్టాం.. 2,200 ఎయిర్ పోర్టుకు.. ఎయిరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేం వచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం.. మూడు గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం.. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు, చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేక పోయారు.. మేం వచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంట పడ్డాం.. నేను స్వయంగా వెళ్ళి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు.
Read Also: Kolkata: ఎన్నికల వేళ కోల్కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్చల్
Also Read
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
ఇక, కావాల్సిన అనుమతులు మొత్తం మేమే తెచ్చాం అని జగన్ పేర్కొన్నారు. ప్రతీ పని మా హయంలోనే జరిగింది.. రోడ్లు, నీళ్లు, కరెంట్ కు కూడా మేమే నిధులు ఇచ్చాం.. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా మేం ఫోకస్ చేసాం కాబట్టే శంకుస్థాపన చేశాం.. అప్పుడే చెప్పా 2026లో ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుంది అని.. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఆరు లైన్ల రహదారి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని అడిగాం.. మేం అడగటం వల్లే కేంద్రం శాంక్షన్ చేశామని స్వయంగా చెప్పారు… రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఓవైపు ఎయిర్ పోర్టు పనులు పూర్తి అవుతుంటే రోడ్డు మీద మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. కనీసం ఆ పని కూడా చేయలేదు.. కానీ చంద్రబాబు, ఆయన కేంద్రమంత్రి అంతా మేమే చేశాం అంటారు.. క్రెడిట్ విత్ ఔట్ కాంట్రిబ్యూషన్ అనేలా చంద్రబాబు మనస్తత్వం.. ఎవరో చేసిన దానికి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే అని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు
తాజావార్తలు
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!