Chandra Babu: జగన్పై నమ్మకం లేదు.. అందుకే తెలంగాణలో కలుస్తామంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
chandrababu comments on ap government on polavaram merging villages: ఏపీలో కొత్త వివాదం నెలకొంది. పోలవరం ముంపు మండలాలలోని ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఆందోళనలకు దిగారు. తమను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తమ గ్రామాలను తెలంగాణలో కలిపితే తమకు అక్కడి ప్రభుత్వం అండ దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ అంశంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద నమ్మకం లేకపోవడం వల్లే విలీన మండలాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విలీన మండలాల్లో విద్యుత్ సరఫరా లేక, తాగడానికి నీరు లేక ప్రజలు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. వరదల్లో వచ్చిన బురదను, రహదారుల్లో కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read Also: PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
Also Read
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
వారం క్రితమే వరదలు తగ్గాయని మంత్రులు ప్రకటనలు చేసినా ఇంకా విలీన మండలాల్లో విద్యుత్తు సదుపాయాన్ని ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద బాధితులకు కనీస సదుపాయాలు అందకపోవడంతోనే ఎటపాక మండలంలోని ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు వేసిన ప్రశ్నలపై ఎదురుదాడి మాని ప్రజల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని ఆయన సూచించారు. వరదల్లో చనిపోయిన పశువుల కళేబరాలతో దుర్గంధం మధ్య ఇళ్లలోకి విషసర్పాలు చేరడంతో ప్రజలు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారని, వారి బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.
ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండి.(4/5)
— N Chandrababu Naidu (@ncbn) July 24, 2022
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!