Chandra Babu: జగన్పై నమ్మకం లేదు.. అందుకే తెలంగాణలో కలుస్తామంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
chandrababu comments on ap government on polavaram merging villages: ఏపీలో కొత్త వివాదం నెలకొంది. పోలవరం ముంపు మండలాలలోని ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఆందోళనలకు దిగారు. తమను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తమ గ్రామాలను తెలంగాణలో కలిపితే తమకు అక్కడి ప్రభుత్వం అండ దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ అంశంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద నమ్మకం లేకపోవడం వల్లే విలీన మండలాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విలీన మండలాల్లో విద్యుత్ సరఫరా లేక, తాగడానికి నీరు లేక ప్రజలు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. వరదల్లో వచ్చిన బురదను, రహదారుల్లో కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read Also: PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
వారం క్రితమే వరదలు తగ్గాయని మంత్రులు ప్రకటనలు చేసినా ఇంకా విలీన మండలాల్లో విద్యుత్తు సదుపాయాన్ని ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద బాధితులకు కనీస సదుపాయాలు అందకపోవడంతోనే ఎటపాక మండలంలోని ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు వేసిన ప్రశ్నలపై ఎదురుదాడి మాని ప్రజల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని ఆయన సూచించారు. వరదల్లో చనిపోయిన పశువుల కళేబరాలతో దుర్గంధం మధ్య ఇళ్లలోకి విషసర్పాలు చేరడంతో ప్రజలు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారని, వారి బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.
ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండి.(4/5)
— N Chandrababu Naidu (@ncbn) July 24, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!