Muraleedharan: ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Minister Muraleedharan Says AP People Looking For Alternative Political Power: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలో కొనసాగించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించి.. బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా.. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో.. ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిపేందుకు.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక రోడ్డు మ్యాప్ డిసైడ్ చేసుకోవాలని సూచించారు.
Weight Loss: బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. తగ్గడానికి ఇలా చేయండి..!
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాపై గురతర బాధ్యతలున్నాయని.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని.. ప్రతీ కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉంది కాబట్టి.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంద్నారు. అలాగే.. రాజకీయంగా వేసే అడుగులపై కూడా ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యల వలయమేనని, కేంద్రం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్నారు. బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ అని పురందేశ్వరి ఉద్ఘాటించారు.
Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!