వివేకా కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. మళ్ళీ ఇల్లంతా పరిశీలన !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది..విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు…గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు..
పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది..హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కి చెందిన సెల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సెల్ పాయింట్ లో గతంలో ఇచ్చాడని అందుకు కారణంగానే సెల్ పాయింట్ నిర్వాహకుడిని విచారణ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
అనంతరం సీబీఐ బృందం వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన ఎర్ర గంగిరెడ్డి ని కూడా విచారణకు పిలిపించి సుమారు రెండు గంటలకు పైగా విచారణ చేశారు..విచారణలో భాగంగా హత్య జరిగిన తీరుతో పాటు అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి ఆరా తీసి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం… అంతేకాకుండా ఈ ముగ్గురు వ్యక్తుల విచారణ అనంతరం వివేకా ఇల్లు,,హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు….త్వరగా కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ బృందం వేగవంతం చేస్తూ ముందుకు వెళ్తోంది..ఇక మొదటి రోజు విచారణ తర్వాత కూడా వైఎస్ కుటుంబానికి చెందిన ముఖ్య నేతలు మరియు కుటుంబ సభ్యులను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది..
గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం… ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది…ఇటు వివేకా హత్య కేసు రాజకీయంగా పలు విమర్శలకు తోడవ్వడంతో పాటు వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు వేగవంతం చేయాలని కోరడం చూస్తుంటే త్వరలోనే సీబీఐ బృందం దోషులను నిర్ధారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- corona
- murder case
- viveka
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!