వివేకా కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. మళ్ళీ ఇల్లంతా పరిశీలన !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది..విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు…గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు..
పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది..హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కి చెందిన సెల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సెల్ పాయింట్ లో గతంలో ఇచ్చాడని అందుకు కారణంగానే సెల్ పాయింట్ నిర్వాహకుడిని విచారణ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
అనంతరం సీబీఐ బృందం వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన ఎర్ర గంగిరెడ్డి ని కూడా విచారణకు పిలిపించి సుమారు రెండు గంటలకు పైగా విచారణ చేశారు..విచారణలో భాగంగా హత్య జరిగిన తీరుతో పాటు అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి ఆరా తీసి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం… అంతేకాకుండా ఈ ముగ్గురు వ్యక్తుల విచారణ అనంతరం వివేకా ఇల్లు,,హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు….త్వరగా కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ బృందం వేగవంతం చేస్తూ ముందుకు వెళ్తోంది..ఇక మొదటి రోజు విచారణ తర్వాత కూడా వైఎస్ కుటుంబానికి చెందిన ముఖ్య నేతలు మరియు కుటుంబ సభ్యులను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది..
గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం… ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది…ఇటు వివేకా హత్య కేసు రాజకీయంగా పలు విమర్శలకు తోడవ్వడంతో పాటు వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు వేగవంతం చేయాలని కోరడం చూస్తుంటే త్వరలోనే సీబీఐ బృందం దోషులను నిర్ధారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- corona
- murder case
- viveka
తాజావార్తలు
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!