MLC Ananta Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లిన అనంతబాబు.. ఆ తర్వాత డెడ్బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.. వారు ఆందోళనతో డెడ్బాడీతో పాటు కారు కూడా అక్కడే వదిలి వెళ్లిపోయిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశామని.. వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు..
ఈ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం, సీఎం జగన్ నిష్పక్షపాతంగా విచారణ చేయమని చెప్పారు.. ఇప్పుడున్న ఆధారాలతో అనంత బాబు ప్రధాన నిందితుడు.. అందుకే కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. ఇక, అనంత బాబును పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక టీమ్లు పనిచేస్తున్నాయని తెలిపారు.. ప్రధాన ముద్దాయిగా కుటుంబ సభ్యులు అనంత బాబు పేరును చెప్పడంతో.. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అవుతుందని.. తప్పు చేశాడు కాబట్టి అనంత బాబు ముద్దాయి అవుతాడని తెలిపారు.
Also Read
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపిన ఎస్పీ.. 20న రాత్రి 7.30కి మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు.. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు.. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు.. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు.. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్బాడీ తీసుకు వచ్చారు.. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారని తెలిపారు.. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం.. ఆ తర్వాత హత్యానేరంగా మార్చామన్నారు.. ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రధాన నిందితుడుగా నిర్ధారించామన్న ఆయన.. అనంతబాబుని అరెస్టు చేయబోతున్నాం అని వెల్లడించారు. 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశాం.. అతడి ఫ్రెండ్స్ చెప్పిన వర్షన్లో కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు..
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!