Butta Renuka: నిరీక్షణ తర్వాత బుట్టా రేణుకకు పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి పదవులు లభిస్తాయో తెలీదు. అందునా ఇతర పార్టీల్లోకి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చినవారి విషయంలో వెయిట్ అండ్ సీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా మాజీ ఎంపీ బుట్టా రేణు విషయంలో అదే జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాజీ ఎమ్పీ బుట్టా రేణుకకు పార్టీ పదవి వరించింది. కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది వైసీపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ.

Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
బుట్టారేణుక గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆమె దీనిపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కంటే ఎంపీగా కొనసాగడమే తనకు అమితంగా ఇష్టమని.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననడం ఊహాగానాలేనన్నారు. తనకు ఈ విషయంపై అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా గాని.. ఎంపీగా గాని పోటీ చేసి గెలిచి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రేణుక.
ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వున్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని, తన వారసుడిగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని నిలబడతారనే ప్రచారం సాగింది. అక్కడ బుట్టా రేణుక పోటీచేసే అవకాశమే లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీచేయడం బెటర్ అంటున్నారు.
బుట్టా రేణుక వైసీపీ తరఫున గెలిచి, తర్వాత 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరడంపై విమర్శలు వచ్చాయి. పారిశ్రామిక వేత్తగా వున్న బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్సార్సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీని వీడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలో చేరారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనను మోసం చేసిందంటూ మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీని వీడినందుకు జగన్కు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. అలాగే గత ఎన్నికల్లో ఎలాంటి పదవి లేకపోయినా జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల్ని గెలిపించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆమె పై వున్న అపప్రథ పోవడంతో పార్టీ అధిష్టానం ఆమెకు పదవి కట్టబెట్టింది. మరి 2024 ఎన్నికల్లో బుట్టా రేణుక ఎక్కడినించి పోటీచేస్తారో వేచి చూడాల్సిందే.
Common Wealth Games 2022: లాంగ్ జంప్ ఈవెంట్లో ఫైనల్కు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..