సీఎం జగన్ పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణంకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారని..ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారని వెల్లడించారు. కేంద్రం ఇంటి నిర్మాణానికి నిధులు కల్పిస్తుందని…భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం చేస్తోందన్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించే చర్యలు తీసుకుందని తెలిపారు. సిఎం జగన్ అభిమతం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అని…అందుకే మూడు రాజధానులపై చట్టం చేశారన్నారు. మూడు రాజధానుల చట్టం చేసినప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని.. ఏ రోజైనా, ఏ క్షణమైనా ఇది జరుగచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా మూడు రాజధానులు చేస్తామని…టిడిపి వారు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనుకుంటారని..వారిది పైశాచిక ఆనందం అని ఫైర్ అయ్యారు.