Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bopparaju Venkateswarlu Announced Movement Against Ap Government

Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు

Published Date :February 26, 2023 , 9:14 pm
By NTV WebDesk
Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bopparaju Venkateswarlu Announced Movement Against AP Government: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే.. ఉద్యమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు హెచ్చరించారు. కర్నూల్లో ఫిబ్రవరి 5న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 13న సీఎస్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చామన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు.. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాల కోసం ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామన్నారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వానికి సహకరించామన్నారు. ఈరోజు సమావేశం ద్వారా కార్యాచరణ ఉంటుందని ముందే చెప్పామని.. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, చులకనగా చూస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారన్నారు. మా సహనం, ఓర్పును చేతకాని తనంగా చూస్తుందని మండిపడ్డారు.

Nokia: 60 ఏళ్లలో మొదటి సారి లోగో మార్పు.. కొత్త వ్యూహమా?

ఛలో విజయవాడ సమయంలో ఉద్యోగులు తమకు అండగా నిలిచారని.. ఏడాది కాలంగా సీఎం ఇచ్చిన హామీనే అమలు‌ చేయలేదని బొప్పరాజు వ్యాఖ్యానించారు. సీఎం ఆర్ధికపరమైన అంశాలు పరిష్కరించలేదని, మంత్రుల బృందంతో మేం చేసిన చర్చలు చాయ్ బిస్కట్ చర్చలు మాత్రమేనని పేర్కొన్నారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వంపై తమకున్న నమ్మకం పూర్తిగా సడలిపోయిందన్నారు. ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు మమ్మల్ని క్షమించవని పిలుపునిచ్చారు. నేడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గతంలో 11వ పీఆర్సీని కూడా తాము పోగొట్టుకున్నామని.. తమ ఆవేదనను గుర్తించాల్ని, తమను శతృవులుగా చూడకండని కోరారు. ఈ పరిణామాలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికీ చాలా సహనంతో ఉన్నాం, ఇక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

MK Stalin: నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్‌.. స్టాలిన్‌ బర్త్‌డే ప్లాన్

ఏడాదిగా సమస్యలకు పరిష్కారం చూపనందు‌వల్లే తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోళనలు, నిరసనలు ఉంటాయన్నారు. ఉద్యమాలు ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేయరన్న ఆయన.. తమ ఆవేదన, ఆక్రోశం ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఎప్పుడు జీతం ఇస్తారో తెలియట్లేదని, వందలో డెబ్బై రూపాయలు మాత్రమే తమకు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేసే ఆలస్యం వల్ల ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో చులకన భావం వచ్చే పరిస్థితికి ప్రభుత్వం మమ్మల్ని తెచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. 11వ పీఆర్సీ చర్చల సమయంలో ఇచ్చిన హామీని నేటికీ అమలు‌ చేయలేదని, అందుకే ఇప్పుడు ఉద్యమం తప్పదనే కార్యాచరణ ప్రకటించామని చెప్పారు.

ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన కార్యాచరణ
మార్చి 9,10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు.
మార్చి 13,14,15 భోజన విరామ సమయంలో ఆందోళన.
మార్చి 16-20 వరకు అన్ని జిల్లాల్లో ధర్నాలు.
మార్చి 21న సెల్ డౌన్.
మార్చి 24న హెడ్ ఆఫీసుల వద్ద ధర్నా.
మార్చి 27న కరోనాతో‌ చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులకు పరామర్శ.
ఏప్రిల్ ఒకటిన సీపీఎస్ ఉద్యోగులు కుటుంబాల పరామర్శ.
ఏప్రిల్ మూడున ఛలో స్పందన
ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. రెండో ఫేజ్ కార్యాచరణ ప్రకటన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • ap govt employees
  • AP JAC Movement
  • AP Sarkar
  • Bopparaju Venkateswarlu

తాజావార్తలు

  • OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions