Ayyanna Patrudu House Issue: జగన్.. ఇవాళ నీది.. రేపు మాది.. బోండా ఉమా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక టీడీపీ నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ఆరోపించారు. ఆ ఓర్వలేనితనంతోనే అయ్యన్న ఇంటి గోడను కూల్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాల్చి చంపుతానని జగన్ ఆనాడు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుట్కా గాడు, కొబ్బరి చిప్పలగాడు మాట్లాడిన మాటలు సంగతేంటీ..? అంటూ ప్రశ్నించారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
కొబ్బరి చిప్పల నాయకుడు వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నిప్పలు చెరిగారు. ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేసినా మేం తగ్గేది లేదని అన్నారు. రేపట్నుంచి ఇంతకు పదింతలు మాట్లాడతామంటూ పేర్కొన్నారు బోండా ఉమ. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు.. ఇది అధికార దుర్వినియోగం కాదా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలకు అధికారులు సహకరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చిరించారు బొండా ఉమ.
అయితే నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు ఈరోజు తెల్లవారుజామున పెద్దయెత్తున పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి అయ్యన్నపాత్రుడు గోడ నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రెండు సెంట్ల భూమిని ఆక్రమించి అయ్యన్న గోడ కట్టారని, వాటిని తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!