Kanna vs GVL: కన్నా ఆరోపణలు.. జీవీఎల్ కౌంటర్
Kanna vs GVL: బీజేపీకి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై విమర్శలు గుప్పించారు.. ముఖ్యంగా.. పార్టీలో సముచిత స్థానం లేదు, గౌరవం లేదు.. సొంత సంస్థల పార్టీ నడుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. అయితే, కన్నా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జీవీఎల్.. కన్నాకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చిందన్న ఆయన.. ఏపీ అధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు.. కానీ, రాజకీయ దురుద్దేశ్యంతోనే కన్నా ఆరోపణలు చేస్తున్నారు.. అందుకే రాజీనామా ప్రకటన చేశారని విమర్శించారు.. గతంలోనూ.. ఇప్పుడూ సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని స్పష్టం చేసిన జీవీఎల్.. కేంద్ర పార్టీ అనుమతితోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.. సోము వీర్రాజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని తేల్చిచెప్పారు.. ఇదే సమయంలో.. నాపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనంటూ.. స్పష్టం చేశారు. ఇక, బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని.. అలాంటి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు జీవీఎల్ నరసింహారావు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కాగా, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్బై చెప్పేశారు.. తన నివాసంలో ఇవాళ ముఖ్యఅనుచరులతో సమావేశమైన కన్నా.. పార్టీలో గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేక పోతున్నా.. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించారు. దీంతో, కన్నా నిర్ణయాన్ని ఆహ్వానించారు ఆయన అనుచరులు.. కన్నా వెంటే తమ ప్రయాణం అంటూ.. కన్నాకకు మద్దతుగా నినాదాలు చేశారు.. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్టు వెల్లడించారు.. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చా.. కానీ, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయి.. సోము వీర్రాజు పార్టీని సొంత సంస్థలాగా నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. పార్టీలో చర్చించకుండా ఎంపీ జీవీఎల్ సొంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన కన్నా.. కేవలం సోము వీర్రాజు వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా ముందు ప్రకటించారు.. అయితే, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో 15 మంది నేతలు కూడా బీజేపీకి గుడ్బై చెప్పారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో