Somu Veerraju: వైసీపీ రాళ్ళ దాడిపై బీజేపీ సీరియస్.. ఉద్యమం తప్పదని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. నెల్లూరులో వైసీపీ రాళ్ళ దాడిపై బీజేపీ సీరియస్ అయింది. బీజేపీ ఏపీ చీఫ్ ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. రాళ్ళ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. హిందూ సమాజం పట్ల నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవమానకరంగా వ్యవహరించారు. బీజేవైఎం కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుంటే.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Group-4 Jobs : గ్రూప్-4 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి ముస్లిం టోపీ పెట్టుకుని ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాదయాత్ర ఎలా చేస్తారు..? అనిల్ కుమార్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు సమక్షంలో వైసీపీ నేతలు దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం అన్నారు సోము వీర్రాజు. అయ్యప్ప మాల వేసుకుని ముస్లిం లాగా తలపై టోపీ పెట్టుకుని మసీదు లోకి ఏ విధంగా వెళ్తారని వారంతా ప్రశ్నించారు.
అనిల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇస్కాన్ సిటీలోని మాజీ మంత్రి అనిల్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనిల్ తీరుని తప్పుబట్టారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
Read Also: Pawan Kalyan: 27న ఇప్పటం పర్యటనకు పవన్.. పోలీసుల యాక్షనేంటో?
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!