Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp And Tdp Tieup In Ap Politics

TDP and Bjp: రెండు భిన్న ధృవాలను కలిపిన ద్రౌపది ముర్ము

Published Date :July 12, 2022 , 10:14 pm
By NTV WebDesk
TDP and Bjp: రెండు భిన్న ధృవాలను కలిపిన ద్రౌపది ముర్ము
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజకీయాల్లో రెండు పార్టీలు భిన్న ధృవాలుగా వుంటాయి. అందునా అవి రెండూ కలిపి నడవడం అనేది జరగదు. కానీ ఒకే ఒక అంశం వారిని కలిపింది. అదే రాష్ట్రపతి ఎన్నిక. ఏపీలో టీడీపీ, బీజేపీ కలిపి నడవడం ఎప్పుడో ఆగిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి నడిచాయి. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందే బీజేపీ-టీడీపీ బంధానికి బీటలు వారాయి. ఎడమొహం-పెడమొహంగా రెండూ పక్షాలు కత్తులు దూసుకున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ బలహీనం అయింది. బీజేపీకి కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బీజేపీ నేతలు టీడీపీని దగ్గరకు రానీయలేదు. చంద్రబాబు మోడీని కలవాలని భావించినా అది సాధ్యం కాలేదు.

2019 తర్వాత బీజేపీ నేతలు-టీడీపీ నేతలు కలిసి ఒక వేదిక పంచుకున్నది కూడా లేదనే చెప్పాలి. తాజాగా నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఒక ఎన్నిక ఈ భిన్నధృవాలను కలిపిందనే చెప్పాలి. నువ్వాదరిన, నేనీదరిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ… అన్నట్టుగా బీజేపీ-టీడీపీలు జూలై 12వ తేదీన కలిశాయి. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థిని శ్రీమతి ద్రౌపది ముర్ముకి అధికార వైసీపీ మద్దతు తెలిపింది. అలాగే, అరుదుగా విపక్షం కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థికి తమవంతు మద్దతు ప్రకటించడం కీలక పరిణామంగానే చెప్పాలి. ఇటు బీజేపీ, అటు టీడీపీ, వైసీపీ మూడూ కలిపి రాష్ట్రపతి అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలవడం విశేషంగా చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ గురించి అంతగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా లేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన వెంటనే జగన్ ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చ్చారు. ఆ తర్వాత చంద్రబాబు తన నిర్ణయం ప్రకటించారు.

Also Read

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
  • Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

Bjp2 Babu

విజయవాడలో గేట్ వే హోటల్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఎంతో కష్టపడి ఎదిగారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్మును బలపరచాలని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. గిరిజనులను, ఆదివాసీలను అభివృద్ధి చేయడం అరుదుగా జరుగుతుంటుందని అన్నారు. ఈ దిశగా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడం హర్షణీయమని ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు ప్రకటించడాన్ని బట్టి రెండు పార్టీల ఆలోచన ఒకటే అని తేలింది. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకి ఓటేస్తారని చంద్రబాబు ప్రకటించడంపై బీజేపీ నేతలు హర్షం ప్రకటించారు.

Fxdkzbuueai Ne0

Telangana Floods : భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు..

చంద్రబాబు అంటే అంతెత్తున ఎగిరిపడే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబుని పొగిడేశారు. ద్రౌపది ముర్ముకు అధికార పక్షం-ప్రతిపక్షం తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ మద్దతు పలికిన రాష్ట్రాలు ఏపీ, మిజోరాం మాత్రమేనని చంద్రబాబుతో అన్నారు జీవీఎల్. చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణ ఉంగరం వివరాలు అడిగి తెలుసుకున్నారు సోము వీర్రాజు. ఇటు ఏపీ రాజకీయాల గురించి అంతగా పట్టించుకోని కిషన్ రెడ్డి కూడా ఈమధ్యకాలంలో రెండవసారి ఏపీకి వచ్చారు. ఈనెల 4వ తేదీన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నాడు విగ్రహావిష్కరణ, మోడీ సభకు వచ్చారు. మళ్ళీ ఇవాళ అటు వైసీపీ, ఇటు టీడీపీ సమావేశానికి వచ్చారు కిషన్ రెడ్డి.

స్వాతంత్రం వచ్చాక మొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం దక్కింది. టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42 పార్టీలు దేశంలో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నాయి. మన పక్క రాష్ట్రం మహిళ రాష్ట్రపతి అభ్యర్థి కావటం అదృష్ఠం. గతంలో అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ మద్దతు ఇవ్వడం సంతోషం. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటూ ప్రశంసించారు కిషన్ రెడ్డి. ఇటు ఏపీ బీజేపీ నేతలు, అటు తెలంగాణకు చెందిన బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం టీడీపీతో కలిసి కూర్చున్నారు. మొత్తం మీద వాడిపోయిన బంధం మళ్ళీ చిగురించినట్టయింది. ఈ బంధం మున్ముందు మరింతగా బలపడుతుందా? రాష్ట్రపతి ఎన్పికతోనే బంధం పూర్వవుతుందా? అనేది తేలాల్చి వుంది.

Draupadi Murmu: ద్రౌపది ముర్కుకి టీడీపీ మద్దతు.. ఆమెకు ఓటెయ్యాలని బాబు పిలుపు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • chandrababu
  • Draupadi Murmu
  • gvl
  • intersting scene in ap poltiica arena

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions