Robbery: దుండగుల హల్చల్.. పోలీసులమంటూ 80 లక్షల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Police Arrested Three Men For Robbery In AP Police Dress: ఆ ముఠాలో మొత్తం ముగ్గురు ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ వీళ్లు.. డబ్బులు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలకు టోకరా వేసి.. ఏకంగా రూ. 80 లక్షలు దోచేసుకున్నారు. అదికూడా తాము పోలీసులమని అబద్ధం చెప్పి, ఈ దోపిడీకి పాల్పడ్డారు. చివరికి వీరి పప్పులు ఉడకపోవడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త
Also Read
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
ఆ ముగ్గురు దుండుగల పేర్లు.. బత్తుల శివరామకృష్ణ యాదవ్ (19), షేక్ చెంపతి లాల్ బాషా, షేక్ చెంపతి జాకిర్(27). ఆంధ్రప్రదేశ్కి చెందిన వీళ్లు.. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమ అవసరాల కోసం డబ్బులు సంపాదించడానికి.. దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వీళ్లు ఇటీవల కుమారస్వామి, చందన్ అనే ఇద్దరు వ్యాపారుల్ని బెదిరించి.. వారి వద్ద నుంచిరూ. 80 లక్షలు దోచుకున్నారు. ఏపీ పోలీసుల తరహాలో దుస్తులు ధరించి బెదిరించడంతో.. ఆ వ్యాపారులు భయపడిపోయి డబ్బులు ఇచ్చేశారు. అనంతరం ఆ వ్యాపారులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముగ్గురిని చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారు.
Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్
ఈ కేసు వివరాల్ని డీసీపీ శ్రీనివాస్ గౌడ వెల్లడిస్తూ.. పోలీసుల దుస్తులు ధరించి, ఆ వ్యాపారుల నుంచి ఈ దుండగులు రూ. 80 లక్షలు జప్తు చేసుకున్నారన్నారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్లో జూదం ఆడారు. తొలుత రూ.కోటి గెల్చుకున్న వీళ్లు.. కొద్ది గంటల్లోనే ఆ నగదును ఓడిపోయారు. మిగిలిన నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. చిత్తూరులో ఉన్నారని సమాచారం తెలిసి, అక్కడ అరెస్ట్ చేశామన్నారు. వీరిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కుపైగా కేసులు ఉన్నాయని తాము గుర్తించామన్నారు.
Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ
తాజావార్తలు
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!