Robbery: దుండగుల హల్చల్.. పోలీసులమంటూ 80 లక్షల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Police Arrested Three Men For Robbery In AP Police Dress: ఆ ముఠాలో మొత్తం ముగ్గురు ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ వీళ్లు.. డబ్బులు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలకు టోకరా వేసి.. ఏకంగా రూ. 80 లక్షలు దోచేసుకున్నారు. అదికూడా తాము పోలీసులమని అబద్ధం చెప్పి, ఈ దోపిడీకి పాల్పడ్డారు. చివరికి వీరి పప్పులు ఉడకపోవడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
ఆ ముగ్గురు దుండుగల పేర్లు.. బత్తుల శివరామకృష్ణ యాదవ్ (19), షేక్ చెంపతి లాల్ బాషా, షేక్ చెంపతి జాకిర్(27). ఆంధ్రప్రదేశ్కి చెందిన వీళ్లు.. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమ అవసరాల కోసం డబ్బులు సంపాదించడానికి.. దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వీళ్లు ఇటీవల కుమారస్వామి, చందన్ అనే ఇద్దరు వ్యాపారుల్ని బెదిరించి.. వారి వద్ద నుంచిరూ. 80 లక్షలు దోచుకున్నారు. ఏపీ పోలీసుల తరహాలో దుస్తులు ధరించి బెదిరించడంతో.. ఆ వ్యాపారులు భయపడిపోయి డబ్బులు ఇచ్చేశారు. అనంతరం ఆ వ్యాపారులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముగ్గురిని చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారు.
Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్
ఈ కేసు వివరాల్ని డీసీపీ శ్రీనివాస్ గౌడ వెల్లడిస్తూ.. పోలీసుల దుస్తులు ధరించి, ఆ వ్యాపారుల నుంచి ఈ దుండగులు రూ. 80 లక్షలు జప్తు చేసుకున్నారన్నారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్లో జూదం ఆడారు. తొలుత రూ.కోటి గెల్చుకున్న వీళ్లు.. కొద్ది గంటల్లోనే ఆ నగదును ఓడిపోయారు. మిగిలిన నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. చిత్తూరులో ఉన్నారని సమాచారం తెలిసి, అక్కడ అరెస్ట్ చేశామన్నారు. వీరిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కుపైగా కేసులు ఉన్నాయని తాము గుర్తించామన్నారు.
Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ
తాజావార్తలు
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!