Viral News: ఆవు దూడకు బారసాల అదిరేలా.. ఎక్కడంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్ళి, సీమంతం, ఆషాఢమాసం సారె, సంక్రాంతికి ఇంటి అల్లుడికి అదిరిపోయే మర్యాదలు, వియ్యపురాలి సారె… కోడిపందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. అక్కడ ఏ వేడుక జరిగినా బ్రహ్మాండంగా వుంటుంది. అమ్మాయో, అబ్బాయో పుట్టినా.. వారికి బారసాల చేయడం ఆనవాయితీ. కాకినాడ జిల్లాలో ో పెద్దాయనకు ఆవులు, ఆవుదూడల్ని పెంచడం హాబీ. తన కుటుంబంలో సభ్యులుగా వాటిని సాకుతుంటారు.
తాజాగా 3నెలల పుంగనూరు ఆవు దూడకు బారసాల చేశారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. వేదమంత్రాలతో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో శాస్త్రోక్తంగా జరిపిన వేడుక జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. నా బారసాలకు రండి అంటూ పుంగనూరు ఆవుదూడ పిలిచినట్టుగా ఆహ్వాన వీడియో తయారుచేశారు. బంధువులు అంతా తరలి రాగా.. చిన్నపిల్లల్ని వేసినట్టు ఉయ్యాలలో వేసి జోలపాడారు. ఆ లేగదూడను పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. ఆ లేగదూడ కూడా వీరికి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ బారసాలకు వచ్చిన బంధువులు కూడా వీరి అనుబంధాన్ని చూసి నవ్వుకున్నారు.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
గత ఏడాది కాకినాడ సమీపంలోని యానాంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో పెళ్ళయింది. సారెలో భాగంగా అల్లుడికి పెళ్ళికూతురు తండ్రి భారీగా సారె పంపారు.
వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లికొడుకు పవన్ ఇంటికి చేరాయి. ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. అట్లుంటాది మరి గోదారోళ్ళ మర్యాదలు, ఆప్యాయతలు.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!