Bandla Ganesh F2F: మంత్రి రోజాకు సినీ పరిశ్రమ సన్మానం చేయాలి
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఎన్టీవీ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్రెడ్డి తనకు మంచి స్నేహితులు అని.. స్నేహానికి, రాజకీయానికి సంబంధం లేదని బండ్ల గణేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలన చాలా బాగుందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పడానికి తన దగ్గర ఎలాంటి ఆరోపణ లేదని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని నొక్కి చెప్పారు. ఈరోజు ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్ అంటే తెలంగాణ అని మాట్లాడారు.
ఇటీవల పక్క రాష్ట్రాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడినప్పుడు.. ఏపీలోని వైసీపీ మంత్రులు ఎందుకు స్పందించారో తనకు తెలియదని బండ్ల గణేష్ వెల్లడించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే వైసీపీ వాళ్లు భుజాలు ఎందుకు తడుముకున్నారని ఆరోపించారు. అయితే హైదరాబాద్లో కరెంట్ లేదని మంత్రి బొత్స ఆరోపించడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. తనను కొందరి గురించి అడగొద్దని బండ్ల గణేష్ సూచించారు. తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అని.. తాను చచ్చిపోయేదాకా పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటానని స్పష్టం చేశారు. అటు బొత్స సత్యనారాయణ తనకు అన్న లాంటి వారు అని బండ్ల గణేష్ చెప్పారు. టీడీపీలోనూ తనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కాగా విజయసాయిరెడ్డితో ఇటీవల జరిగిన ట్విట్టర్ వార్ గురించి బండ్ల గణేష్ స్పందించారు. విజయసాయిరెడ్డికి ఓ వ్యక్తిపై కోపం ఉంటే ఆ వ్యక్తితోనే తేల్చుకోవాలని.. అంతేకానీ కులం పేరుతో అందరినీ దూషించడం సరికాదనే తాను ట్వీట్ల రూపంలో సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కులం పేరుతో దూషించడం సరికాదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. తనకు కులపిచ్చి లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఓ సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మాట అవాస్తవమని.. టీడీపీ హయాంలో హోంమంత్రి చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడిది ఏం సామాజిక వర్గమని బండ్ల గణేష్ ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలవాలంటే కులం కాదని దమ్ము ఉండాలని చెప్పారు. ఓటమి అనేది రేపటి గెలుపునకు నాంది అని.. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి మహామహులు కూడా ఓడిపోయారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అటు రాజకీయాల్లో రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం శుభపరిణామమని బండ్ల గణేష్ అన్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను సినీ పరిశ్రమ సన్మానించాల్సిన అవసరం ఉందన్నారు. రోజాను మంత్రిగా చూడటం చాలా ఆనందంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో