Bandaru Satyanarayana Murthy: వైసీపీ చేస్తోంది గర్జన కాదు.. పిల్లి కూత, కుక్క అరుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandaru Satyanarayana Murthy Fires On Visakha Garjana: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన ‘విశాఖ గర్జన’ కార్యక్రమంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేస్తోంది విశాఖ గర్జన కాదని.. పిల్లి కూతనో, కుక్క అరుపునో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కప్పల అప్పల్రాజు కప్పలా అరుస్తున్నాడంటూ విమర్శించారు. ఉత్తరాంధ్రను తామే అభివృద్ధి చేశామని.. ఒకవేళ టీడీపీ అభివృద్ధి చేసిందని నిరూపించలేకపోతే తమ చెప్పుతో తామే కొట్టుకుంటామని సవాల్ చేశారు. విశాఖ భూములపై వేసిన సిట్-1, సిట్-2 నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. సిట్ నివేదికలో ఉన్న అంశాలని పట్టుకుని.. జగన్, విజయసాయి బేరాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రెండు సిట్ నివేదికలు బయటకొస్తేజజ జగన్, విజయసాయి రెడ్డిలకు జైల్లో బ్యారెక్స్ సిద్దంగా ఉంటాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మంచిదని మంత్రి ధర్మాన ఎలా అంటారని ప్రశ్నించారు.
అంతకుముందు.. విశాఖలో భూములు కాజేసేందుకు వైసీపీ నేతలు ఎప్పట్నుంచో దృష్టి పెట్టారని, అధికారంలోకి రాగానే స్వాహా మొదలుపెట్టారని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి అవినీతి డబ్బుతో ఛానల్ పెడతానని అంటున్నారని.. సీఎం జగన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్, విజయసాయి వల్ల ఎంతోమంది జైలుపాలయ్యారని.. వీళ్లు మాత్రం ప్రధాని మోడీ దయతో బయట తిరుగుతున్నారని అన్నారు. అసలు విజయసాయికి విశాఖతో పని ఏమిటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని, ఇందులో కొన్ని అక్రమ లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు.హయగ్రీవ, కూర్మన్నపాలెం ప్రాజెక్టుల వ్యవహారాలపై సిబిఐ, ఇడి విచారణకు సీఎం జగన్ ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?